GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ జరిగింది. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.