HYD: రాష్ట్రంలో చికెన్ షాపుల బంద్ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు నిల్వ ఉంచిన మాంసాన్ని వాడే ప్రమాదం ఉందని, దానివల్ల బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. తాజా చికెన్ లభించని ప్రస్తుత పరిస్థితుల్లో నాన్-వెజ్ ప్రియులు జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.