WNP: ఇటీవల కాలంలో జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో పనిచేస్తున్న అభి అనే వ్యక్తి అత్యాచార యత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిందితునిపై కఠిన చర్య తీసుకునే విధంగా పాటుపడతానని పేర్కొన్నారు.
MLG: ఏటూరు నాగారంలో మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్థానిక సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు అన్నారు. దెబ్బతిన్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను సర్పంచ్ పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.
MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోయారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
HYD: శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకొని సీపీ సజ్జనార్ సీతారాం బాగ్ పరిసరాల్లో చేపట్టిన భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, రాత్రి 10 గంటల వరకు శోభాయాత్ర ముగిసేలా పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.
భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.
MNCL: మందమర్రి మున్సిపాలిటీలో ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అమలును మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఇంటి పన్నులు, ఇతర బకాయిలను 100 శాతం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
SRPT: తిరుమలగిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సామేలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
NRPT: నారాయణపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మున్సిపాలిటీకి చేరుకుని శానిటేషన్ సిబ్బంది హాజరును పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు.
ASF: కాగజ్నగర్ మండలం జంబూగాలో భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. హరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లు నిర్మించాలని ఆమె సూచించారు. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని రైతులను, అధికారులను కోరారు.
WGL: శ్రీరామనవమి సందర్భంగా నెక్కొండ మండలంలోని బొల్లికొండ జాతరను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకు చేసిన సీతారాముల పవిత్ర బంధం అజారా రామమైనదని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
SRCL: ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై గడిచిన మూడు నెలల్లో 45 కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిరంతరం నిఘా పెట్టామన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిలువలపై ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
HNK: నగరంలోని పెగడపల్లి డబ్బాల్ అడ్డాలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సైతం కళ్యాణం తిలకించారు. ఈ శుభవేళ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
KMM: తిరుమలాయపాలెం మండలం పైనంపల్లిలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు మతసామరస్యానికి వేదికయ్యాయి. హిందూ, ముస్లిం సోదరులు ఏకమై గ్రామ ఐక్యతను చాటారు. సర్పంచ్, ఉపసర్పంచ్ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా జరిగింది. అనంతరం గండ్ర గోపాలరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
MNCL: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలో ఉన్న శ్రీ రామ భజన మందిరాన్ని MLA గడ్డం వినోద్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
VKB: వనపర్తి పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘాతుకాన్ని స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీం తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్య మానవత్వానికే మచ్చ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే పోక్సో చట్టం కింద కఠినంగా శిక్షిచాలన్నారు.