MNCL: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలో ఉన్న శ్రీ రామ భజన మందిరాన్ని MLA గడ్డం వినోద్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.