• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

JN: తమ్మడపల్లి (జి)గ్రామంలో స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నూకల ఐలయ్య ఆధ్వర్యంలో.. సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

March 9, 2025 / 12:29 PM IST

నాంపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

NLG: నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. కంటి చూపు పరిరక్షించుకునే వారి పరిస్థితిని, వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

March 9, 2025 / 11:13 AM IST

ఇళ్ల మధ్య మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు.!

NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోనీ బసవేశ్వర కాలనీలో ఇళ్ళ మధ్యలో మురుగు నీరు నిలవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిన నీటి కారణంగా, దుర్వాసనతో పాటు దోమల బెడద కూడా విపరీతంగా పెరిగిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి, మురుగు నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టి, తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

March 9, 2025 / 10:44 AM IST

జాతీయ లోక్ అదాలత్ లో 18,252కేసుల పరిష్కారం

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ పరిధిలో 18252 కేసులు పరిష్కారం జరిగినట్లు జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. నేటి రోజుల్లో చిన్న చిన్న కేసులతో క్రిమినల్ సంబంధించి కేసులను పరిష్కరించినట్లు ఇంకా 13వేల పైన కేసులు పరిష్కారానికి అనువుగా ఉన్నట్లు ఆమె తెలిపారు.

March 9, 2025 / 10:20 AM IST

చేపల వేటకు వెళ్లి.. వ్యక్తి మృతి

WNP: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రామన్ పాడు రిజర్వాయర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపూర్ మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన వాకడి గిరి (45) ఆదివారం ఉదయం చేపల వేటకు రిజర్వాయర్‌లోకి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 9, 2025 / 10:16 AM IST

రేపటి నుంచి ఇంటర్ పేపర్ వ్యాల్యూయేషన్

NLG: ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని, మిగిలిన సబ్జెక్టులు ఈ నెల 20, 22, 26న ప్రారంభమవుతాయని తెలిపారు.

March 9, 2025 / 10:14 AM IST

నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

MBNR: ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది.

March 9, 2025 / 09:40 AM IST

ఈనెల 11న యువ ఉత్సవ్ పోటీలు

మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 11న యువ ఉత్సవ్ పోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి రంజిత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సైన్స్ మేళా ప్రదర్శన, రచన పోటీలు, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, ఉపన్యాసం, యంగ్ ఆర్టిస్ట్ పోటీలు ఉంటాయన్నారు. 15-29 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.

March 9, 2025 / 09:31 AM IST

ఎమ్మెల్సీ రేసులో అద్దంకి..!

NLG: కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేసిన అద్దంకి రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించగా సామేలుకు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు.

March 9, 2025 / 09:29 AM IST

ఈ నెల 16న ఈఎంఆర్ఎస్ ప్రవేశ పరీక్ష

ADB: జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్ నగర్‌లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు.

March 9, 2025 / 09:18 AM IST

48 గంటలు నీటి సరఫరా బంద్

SRD: పైపుల మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా 48గంటల పాటు నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారి విజయలక్ష్మి తెలిపారు. పైపుల లీకేజీ వల్ల 6 మండలాల్లో సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, అమీన్ పూర్, పటాన్ చేరువు, కంది, కొండాపూర్, సదాశివపేట తదితర మండలాల్లో 48 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

March 9, 2025 / 09:09 AM IST

రేపు అధికారులతో MLA సమావేశం

KMR: పట్టణ మున్సిపల్ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో విడివిడిగా సమావేశం ఉంటుందని ప్రతి అధికారి, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు.

March 9, 2025 / 08:48 AM IST

నేడు యాపట్లకు మంత్రి జూపల్లి

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామంలో ఆదివారం నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి, ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి భూమి పూజ చేయనున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్ రంగినేని రమేశ్ రావు తెలిపారు. మంత్రి పర్యటనను కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్ తెలిపారు.

March 9, 2025 / 08:39 AM IST

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

NZB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP వెంకట్ రెడ్డి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాశ్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే, నాగారానికి చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.10.17 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

March 9, 2025 / 08:15 AM IST

పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు: తుమ్మల

NLG: పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండలో ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అర్హత కలిగిన నిరుపేద కుటుంబానికి ఇళ్లు వస్తాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యేలు బాలునాయక్, వీరేశం, జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

March 9, 2025 / 08:12 AM IST