• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బావిలో పడిన దుప్పి.. కాపాడిన గ్రామస్థులు

NRML: కడెం మండలం చిట్యాల అటవీ ప్రాంతం వద్ద ఓ చుక్కల దుప్పిని గ్రామస్థులు కాపాడారు. దుప్పిని కుక్కలు వెంటపడి తరమగా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించి దుప్పిని బయటకు తీశారు. అనంతరం అక్కడకు వచ్చిన సిబ్బందికి దుప్పిని అప్పగించగా, వారు దానికి ప్రథమ చికిత్స అందించి అడవిలో వదిలిపెట్టారు.

March 8, 2025 / 12:43 PM IST

‘దాడులకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలి’

MNCL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని రంగంపేటలో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పీవోడబ్ల్యూ కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. మహిళలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పని స్థలాలలో భద్రత కల్పించాలని, మహిళా పోలీస్ స్టేషన్లలో మహిళా అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు.

March 8, 2025 / 12:39 PM IST

మహిళా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

NGKL: మహిళలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమపథకాలు అమలుచేస్తుందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శనివారం నిర్వహించారు.ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి,సరిత దంపతులు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు.మహిళాసంక్షేమంలో దేశానికే తెలంగాణరాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.

March 8, 2025 / 12:20 PM IST

మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని కాంగ్రెస్: BJP

GDWL: ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని BJP అయిజ పట్టణ అధ్యక్షుడు భగత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం పత్తా లేకుండా పోయిందని విమర్శలు చేశారు.

March 8, 2025 / 12:06 PM IST

సౌర విద్యుత్ ప్లాంట్లకు 101 దరఖాస్తులు

KMM: జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్లకు 101 దరఖాస్తులు వచ్చాయని రెడ్‌కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్ కుమార్ తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూముల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయటం ద్వారా ఆదాయం పొందేల రైతులను కేంద్రం ప్రోత్సహిస్తుందని తెలిపారు.

March 8, 2025 / 10:36 AM IST

మహిళా సాధికారత లింగ వివక్షత అంశంపై చర్చ కార్యక్రమం

KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మహిళా సాధికారత, లింగ వివక్షత అనే అంశంపై డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ, పీజీ విద్యార్థినిలు రెండు భాగాలుగా కూర్చుని కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

March 8, 2025 / 09:34 AM IST

వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిన అక్క హత్య!

HYD: వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని సొంత అక్కని ప్రియుడి సహాయంతో చెల్లి హతమార్చింది. రైల్వే ఉద్యోగి లక్ష్మీకి అరవింద్‌తో వివాహేతర సంబంధం ఉంది. లక్ష్మీ రైల్వే క్వార్టర్స్‌లో తన అక్క జ్ఞానేశ్వరి (మతిస్థిమితం సరిగా లేదు)తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉందని ఇద్దరు కలిసి జ్ఞానేశ్వరిని హత్య చేసి ఒక గుంతలో వేసి చెత్తాచెదారాన్ని కప్పివేశారు.

March 8, 2025 / 08:00 AM IST

కొమురవెల్లి హుండీ ఆదాయం లెక్కింపు

SDPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి కొమురవెల్లిలోని ఆలయ ముఖమండపంలో ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో దేవాలయ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు.15 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించగా హుండీ ఆదాయం రూ. 69లక్షల 11వేల 633 వచ్చింది. మొత్తం డబ్బులను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.

March 8, 2025 / 07:33 AM IST

కట్టే కోత మెషీన్‌లో భారీ అగ్ని ప్రమాదం

MDK: చేగుంట మండల కేంద్రంలోని సామిల్ (కట్టే కోత)లో ప్రమాదవశాత్తూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో ఉన్న యంత్రాలు, రేకుల షెడ్, కట్టెలు కాలి బూడిద అయ్యాయి. సుమారుగా రూ. 20 లక్షల వరకు నష్టం జరిగిందని కట్టే కోత మెషీన్ యజమాని గోవింద్ తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.

March 8, 2025 / 06:49 AM IST

జమ్మికుంట మార్కెట్‌కు 2 రోజులు సెలవులు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఉన్నత కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈనెల 8న శనివారం వారాంతపు యార్డు బంద్‌, 9న ఆదివారం సాధారణ సెలవు ఉన్నట్లు పేర్కొన్నారు. తిరిగి 10న సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు గమనించి సహకరించాలన్నారు. మార్కెట్‌కు నాణ్యమైన సరుకులు తీసుకువచ్చి మంచి ధర పొందాలని సూచించారు.

March 8, 2025 / 06:07 AM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% డెలివరీలు చేయాలి: కలెక్టర్

JGL: ప్రభుత్వ ఆసుపత్రులలో 100% డెలివరీలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జన ఔషది దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వైద్యాధికారులతో, ఏఎన్ఎంలు, డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ ఆశా కార్యకర్తలతో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రానున్న వేసవి దృష్టా ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

March 8, 2025 / 04:09 AM IST

మదర్స్ ఆర్బిక్ పాఠశాలలో పేలిన సిలిండర్

JGL: జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలి పెను ప్రమాదం తప్పింది. మదర్ సా – అరాబిక్ పాఠశాల ముందు ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదం జరిగింది. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో వస్తువులు కాలిపోయి ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.

March 7, 2025 / 06:36 PM IST

నగరంలో 7 షాపుల సీజ్

NZB: నగరంలోని 7 షాపులను మున్సిపల్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఆస్తి పన్ను వసూళ్ల కోసం నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జోన్-2 టీమ్ సభ్యులు శుక్రవారం వినాయక్ నగర్‌లో 7 షాపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారి బసప్ప మాట్లాడుతూ.. బకాయి పడిన ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించాలని సూచించారు.

March 7, 2025 / 05:25 PM IST

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి

NLG: నిడమానూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యాకూబ్ అలీ శుక్రవారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యం వారి మృతి కాంగ్రెస్‌కి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మండల పార్టీ కమిటీ తరఫున సంతాపం ప్రకటించారు.

March 7, 2025 / 02:01 PM IST

ఎలిమినేటి మృతికి 25 ఏళ్లు పూర్తి

NLG: జిల్లా రాజకీయాలను శాసించిన నేతల్లో ఎలిమినేటి మాధవరెడ్డి ఒకరు. వడపర్తిలో 1949 మే 1న జన్మించిన ఆయన ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1983లో BHNG ఎమ్మెల్యేగా గెలిచి NTR వద్ద ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్లో హోం మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో మావోయిస్టులకు టార్గెటయ్యారు. 2000 MAR 7న ఘట్ కేసర్ వద్ద మందుపాతర పేల్చి చంపేశారు.

March 7, 2025 / 01:53 PM IST