• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జమ్మికుంట మార్కెట్‌కు 2 రోజులు సెలవులు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఉన్నత కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈనెల 8న శనివారం వారాంతపు యార్డు బంద్‌, 9న ఆదివారం సాధారణ సెలవు ఉన్నట్లు పేర్కొన్నారు. తిరిగి 10న సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు గమనించి సహకరించాలన్నారు. మార్కెట్‌కు నాణ్యమైన సరుకులు తీసుకువచ్చి మంచి ధర పొందాలని సూచించారు.

March 8, 2025 / 06:07 AM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% డెలివరీలు చేయాలి: కలెక్టర్

JGL: ప్రభుత్వ ఆసుపత్రులలో 100% డెలివరీలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జన ఔషది దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వైద్యాధికారులతో, ఏఎన్ఎంలు, డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ ఆశా కార్యకర్తలతో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రానున్న వేసవి దృష్టా ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

March 8, 2025 / 04:09 AM IST

మదర్స్ ఆర్బిక్ పాఠశాలలో పేలిన సిలిండర్

JGL: జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలి పెను ప్రమాదం తప్పింది. మదర్ సా – అరాబిక్ పాఠశాల ముందు ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదం జరిగింది. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో వస్తువులు కాలిపోయి ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.

March 7, 2025 / 06:36 PM IST

నగరంలో 7 షాపుల సీజ్

NZB: నగరంలోని 7 షాపులను మున్సిపల్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఆస్తి పన్ను వసూళ్ల కోసం నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జోన్-2 టీమ్ సభ్యులు శుక్రవారం వినాయక్ నగర్‌లో 7 షాపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారి బసప్ప మాట్లాడుతూ.. బకాయి పడిన ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించాలని సూచించారు.

March 7, 2025 / 05:25 PM IST

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి

NLG: నిడమానూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యాకూబ్ అలీ శుక్రవారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యం వారి మృతి కాంగ్రెస్‌కి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మండల పార్టీ కమిటీ తరఫున సంతాపం ప్రకటించారు.

March 7, 2025 / 02:01 PM IST

ఎలిమినేటి మృతికి 25 ఏళ్లు పూర్తి

NLG: జిల్లా రాజకీయాలను శాసించిన నేతల్లో ఎలిమినేటి మాధవరెడ్డి ఒకరు. వడపర్తిలో 1949 మే 1న జన్మించిన ఆయన ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1983లో BHNG ఎమ్మెల్యేగా గెలిచి NTR వద్ద ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్లో హోం మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో మావోయిస్టులకు టార్గెటయ్యారు. 2000 MAR 7న ఘట్ కేసర్ వద్ద మందుపాతర పేల్చి చంపేశారు.

March 7, 2025 / 01:53 PM IST

‘మిర్చి యార్డులో జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలి’

SRPT: జిల్లా కేంద్రంలో గల పాత మిర్చి యార్డులో అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు శుక్రవారం కలెక్టర్ తేజస్ నందనాల్ పవార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ లేక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

March 7, 2025 / 01:47 PM IST

‘నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి’

NLG: చిట్యాల మండలంలోని చిన్న కాపర్తిలో శుక్రవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై జరిపిన సర్వేలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నగేష్ పాల్గొని మాట్లాడాతూ.. చిన్న కాపర్తిలో నిరుపేద కుటుంబాల వారికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్నారు. ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం గతంలో 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసినా పేదలకు ఇళ స్థలాల పటాలు పంపిణీ చేయలేదన్నారు.

March 7, 2025 / 01:37 PM IST

ఆన్ లైన్‌లో పరీక్ష ఫలితాలు: డీఈఓ

ADB: చేతివృత్తుల కోర్సుకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఆదిలాబాద్ DEO ప్రణీత తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హేయిర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల 2025 పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేశామన్నారు. http//bse.telangana.gov.in 35నంబరు, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసుకొని ఫలితాలు చూడవచ్చని సూచించారు.

March 7, 2025 / 01:25 PM IST

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

NRML: నిర్మల్, బైంసా, ఖానాపూర్ కోర్టు సముదాయాలలో శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు సివిల్ కేసులతో పాటు రాజిపడదగిన క్రిమినల్, వాహన ప్రమాదాలు, బ్యాంకు రికవరీ, భూ వివాదాలు తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

March 7, 2025 / 01:09 PM IST

చాడకు ఎమ్మెల్సీ పదవి దక్కేనా..?

SDPT: TGలో ఎమ్మెల్యే కోటాలో ఐదు MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో CPI హుస్నాబాద్ టికెట్ కావాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు MLC స్థానాల్లో Ex. MLA చాడ వెంకట్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. కాంగ్రెస్ పొత్తులో భాగంగా రెండు MLC స్థానాలు కేటాయిస్తామని సీపీఐతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

March 7, 2025 / 01:06 PM IST

దేవరకొండ శివారులో పురాతన రామాలయం గుర్తింపు

NLG: దేవరకొండ శివారులోని గాజీ నగర్ రోడ్డు పక్కన ఉన్న గానుగగట్టు కొండపై పురాతన రామాలయాన్ని స్థానిక కాలనీవాసులు గుర్తించారు. దేవాలయంలో రాముడి,సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని ధర్మకర్తలు సందర్శించి పునఃప్రారంభించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఆలయ చరిత్రను తెలపాలని, దేవాదాయ శాఖను సందర్శించాలని కోరుతున్నారు.

March 7, 2025 / 11:23 AM IST

వేసవితాపం.. మార్కెట్‌లోకి పేదవాడి ఫ్రిడ్జ్

BDK:పేదవాడి ఫ్రిడ్జ్ మట్టి కుండలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక వంట పాత్రలు వాడటం ద్వారా రోగాలు ప్రజలను చుట్టుముడుతున్నాయనే భావనతో మరలా ప్రజలు మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవిలో మట్టికుండలో నీళ్లు తాగడానికి ఇష్టపడుతున్నారు. స్థానిక సూపర్ బజార్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ల వద్ద మట్టి కుండలు విక్రయానికి సిద్ధంగా ఉంచారు.

March 7, 2025 / 10:22 AM IST

విజయ డైరీ పాల బిల్లు రాక.. రైతుల ఇబ్బందులు

MBNR: మహబూబ్ నగర్ జిల్లాలో విజయ డైరీలో పాలు పోసే రైతులకు గత రెండు నెలలుగా బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ప్రతి నెల 3, 18 తేదీలలో పాల బిల్లులు వచ్చేవని.. గత కొంతకాలంగా సకాలంలో బిల్లులు రాకపోవడంతో పశుపోషణ ఇబ్బందికరంగా మారిందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ పాల బిల్లులను రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు.

March 7, 2025 / 10:19 AM IST

అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు: అడిషనల్ డైరెక్టర్

JGL: ముందస్తు అనుమతి లేకుండా పట్టా, ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు, భూగర్భ శాఖ అడిషనల్ డైరెక్టర్ జై సింగ్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోరుట్ల మండలంలోని ఏకీన్పూర్, అయిలాపూర్ గ్రామాల్లోని మట్టి గుట్టలను పరిశీలించి, అక్రమంగా మట్టిని తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 7, 2025 / 10:18 AM IST