PDPL: రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్ట్ టోకెన్ సమ్మెకు కార్మికులు పిలుపునిచ్చారు. కర్మాగారం మెయిన్ గేట్ వద్ద ఆర్ఎఫ్సిఎల్, మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కొద్దిసేపు నిరసన తెలిపారు. పోలీసులు గేటు వద్దకు చేరుకొని కార్మికులతో మాట్లాడారు. కార్మిక సంఘ నాయకులు 9 గంటలకు విధులకు వెళ్తామని పేర్కొన్నారు.
KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన వకుళామాత స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాల ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్టేడియం నిర్మాణ దాతలను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కవిత, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
KMM: మధిర నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ పాపారావు అన్నారు. ఆళ్ళపాడు-కలకోట మధ్య నిర్మాణం పూర్తయిన బీటీ రోడ్డును శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
BDK: గుండాల మండలం యాపలగడ్డ గ్రామంలో అరేం వంశీయుల పగిడిద్దరాజు జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అరేం వంశీయుడు, గిరిజన సేవకు సంఘం రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ పగిడిద్ద రాజును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు యుద్ధ వీరుడి విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
BDK: ప్రభుత్వ శిక్షణా సంస్థ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. 60 మంది విద్యార్థుల ప్రవేశానికి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ప్రకటించారు. 10వ తరగతిలో మార్కుల ఆధారంగా 15-23 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని సూచించారు.
MNCL: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య SI సురేశ్ వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన లావణ్య మంగళవారం పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆమెను చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం HYDకి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కాగా ఆమె భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారని తండ్రి ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.
RR: శంషాబాద్ మండల్ పెద్ద షాపూర్ గ్రామంలోని ఓ హైస్కూల్ యాజమాన్యం మూడు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులలో ఉత్తేజపరిచే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న యాజమాన్యంని అభినందించారు.
అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి డా. ఏ.శరత్ను ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. గురువారం హైదరాబాదులో ఆయనను ఛాంబర్లో ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం అందజేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి రూ. 15 కోట్లు ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలన్నారు.
MNCL: బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన సింగతి ఉపేందర్కి స్వాతంత్య్రానికి ముందు ఆంగ్లంలో రాసిన భారతీయ నాటకాల మీద పరిశోధన చేసినందుకు గానూ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఉపేందర్ డాక్టరేట్ అందుకోవడం పట్ల అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
SDPT: పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన చిన్నమైల్ అంజిరెడ్డిని గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సిద్దిపేటకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అంజిరెడ్డి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు భూరెడ్డి విభీషన్ రెడ్డి, అంజిరెడ్డిని తదితరులు పాల్గొన్నారు.
SDPT: షీటీమ్, భరోసా స్నేహిత సిబ్బందితో మహిళల పిల్లల రక్షణ గురించి తీసుకుంటున్న చర్యల గురించి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ సమీక్ష సమావేశం నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.పిల్లల, మహిళల రక్షణకు మేమున్నామని పూర్తి నమ్మకం, భరోసా కల్పించాలన్నారు.
ADB: పట్టణంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలాం అధికారులతో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
NRML: పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఈసారి కూడా మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలన్నారు.
SRD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు గురువారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.
HYD: ఇక మీదట గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల మీది చెత్త వేస్తే చలాన్ల మోత మోగనుంది. రోడ్లపై చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు వేయకుండా GHMC కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. చెత్త వేస్తే భారీగా చలాన్లు వేసేలా ‘కాంప్రహెన్సీ చలాన్ మానిటరింగ్ సిస్టం’ పేరుతో కొత్త యాప్ను తీసుకువచ్చింది. మొదటిసారి వేస్తే రూ. 25,000, రెండోసారికి రూ. 50,000, మూడోసారికి రూ. లక్ష ఫైన్ వేయనుంది.