NLG: నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. కంటి చూపు పరిరక్షించుకునే వారి పరిస్థితిని, వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.