ASF: కాగజ్నగర్ మండలం జంబూగాలో భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. హరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లు నిర్మించాలని ఆమె సూచించారు. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని రైతులను, అధికారులను కోరారు.