WGL: రాయపర్తి మండల కేంద్రానికి చెందిన BRS పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలో తన స్వగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాబోయే స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి, పాలకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలన్నారు.
WGL: పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సహకారం అవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఎవరు ఆందోళన చెల్లకూడదని సూచించారు.
MHBD: ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రచార కార్యదర్శి బోడ రాజు నాయక్ కి గతరాత్రి 11 గంటలకు తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పాము కాటు వేసింది. దీంతో పట్టణంలోని ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
SRD: కంగ్టి మండల జమ్గి కే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శంకర్ కుటుంబీకులకు జిల్లా కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. మాజీ సర్పంచ్ శంకర్ భార్య అవుసుల శ్యామవ్వ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి తీవ్ర సంతపం తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
ADB: ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య విషాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు సీఐ భీమేశ్ తెలిపారు. సోమవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని బోథ్ ఆసుపత్రికి తరలించారు.
SRPT: జిల్లా ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరించారు.
ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ జగదాంబ దేవి, సేవలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం పరిశీలించారు పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టారని గ్రామస్తులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
ADB: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఉట్నూర్ నేతకాని సంఘం నాయకులు కోరారు. సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా సోమవారం ఆ సంఘం నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మహేందర్, సంఘం నాయకులు దర్శన గంగరాజు పాల్గొన్నారు.
NLG: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పూర్తిగా తగ్గింది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 631.30 అడుగులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి తెలిపారు. లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా రైతులకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు పంపిస్తున్నారు.
KNR: ఇండియా క్రికెట్ టీం ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందిన సందర్భంగా కరీంనగర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. రాత్రి 10: 40 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో బాణా సంచాలు పేల్చి సంబరాలు జరిపారు. భారత క్రికెట్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
SRCL: తంగళ్ళపల్లి(M) టెక్స్ టైల్ పార్కులో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వివరాల్లో కెళితే.. గ్రామానికి చెందిన నిమ్మల మహేశ్ అనే వ్యక్తి 9 నెలల క్రితం వ్యాను కొన్నాడు. ఈ క్రమంలో EMIలు కట్టలేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే డీసీఎంకు నిప్పు పెట్టాడని ఎస్సై రామ్మోహన్ తెలిపారు. గ్రామ కారొబార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
JGL: జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటి(సోమవారం) నుండి తిరిగి నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సంద్భంగా ప్రజలు తమ అర్జీలను సమర్పించవచ్చునని సూచించారు.
SRCL: భీమారం గ్రామస్థులు ఆదివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. భీమారం మండల కేంద్రానికి 30 పడకల ఆస్పత్రి ఇటీవల మంజూరైంది. అధికారులు బీట్ వద్ద స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. అయితే ఈ స్థలంలో ఆస్పత్రి మంజూరు చేస్తే రైతులకు ఇబ్బందిగా అవుతుందని, వేరే స్థలంలో ఆస్పత్రిని నిర్మించాలని కోరుతూ.. ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.
KNR: గిద్దె పెరుమాండ్ల దేవస్థానం గ్రౌండ్లో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో వ్యక్తి కారు నేర్చుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ట్రాక్పై ఉన్న స్ట్రీట్ లైట్స్, పూలమొక్కలు, కుండీలను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వాకర్లు భయాందోళనకు లోనయ్యారు.
KNR: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.