PDPL: శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మారం మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి సీతారాముల కళ్యాణంలో పాల్గొని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.