JGL: పాత ఆస్తి పన్నులను మార్చి 31లోగా తప్పనిసరిగా చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో బకాయి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. వసూళ్ల పురోగతిని పరిశీలించి, పెండింగ్ ఉన్న యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. పన్నులు చెల్లించని వారిపై నీటి కనెక్షన్ తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు.