SRCL: ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై గడిచిన మూడు నెలల్లో 45 కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిరంతరం నిఘా పెట్టామన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిలువలపై ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.