వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వివేకనంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను మంగళవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివసేనరెడ్డి కలిసి క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారిస్తే ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చన్నారు.
NLG: మిర్యాలగూడలోని హనుమాన్ దేవాలయాన్ని శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ నెల 26న జరిగే శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహణ కోసం వారు భక్తులతో కలిసి పట్టణంలో బిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగ విశిష్టతను చాటిచెప్పారు.
SRCL: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని పశువుల యజమానులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరమా అగర్వాల్ అన్నారు. చందుర్తి మండలం మర్రి గడ్డ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి ఉచిత టీకాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
NRML: లక్ష్మణచందా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. పాఠశాల HM మాట్లాడుతూ.. మహిళల గొప్పతనాన్ని వివరించారు. మహిళలు ప్రస్తుత సమాజంలో కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు.
SRCL: సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకోవడం నేటితరం యువత బాధ్యతని వేములవాడ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
BHPL: ఘనపూర్ మండలానికి చెందిన సోమ దామోదర్ భార్య లక్ష్మి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.చందుపట్ల కీర్తిరెడ్డి మంగళవారం ఆయన నివాసానికి చేరుకుని మృతురాలి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ADB: ఉట్నూర్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రేపు ఉమ్మడి ADB జిల్లా స్థాయి KU యూత్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు సంబధించిన NSS యూనిట్ విద్యార్థులు పాల్గొంటారని, మొత్తం 12 రకాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
KNR: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి, రంజాన్ మాసం ఏర్పాట్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ మసాబ్ అహ్మద్కు వినతిపత్రం అందజేశారు. శివాలయాలు, శ్రీరామనవమి వేడుకలు జరిగే ఆలయాలతో పాటు రంజాన్ పర్వదినం సందర్భంగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
MNCL: పరిసరాల పరిశుభ్రత అందరూ పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం దండేపల్లి మండలంలోని ఐదు గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గోదావరి నది పుష్కరాల సందర్భంగా గూడెం గుట్ట కాంప్లెక్స్ను పరిశీలించారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు ప్రజాతీర్పును ప్రభుత్వం గౌరవించి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. కేసు విచారణలో భాగంగా చెన్నూర్ కోర్టుకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కుట్రలు చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య మంగళ వారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎర్ర అంజయ్య మాట్లాడుతూ.. ప్రతి పరీక్షా కేంద్రంలో నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
NLG: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ మైనంపల్లిలో డ్రైనేజీలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్రరాంసింగ్ నాయక్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
NZB: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ మరణం తీరని లోటని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కంచెట్టి గంగాధర్ మంగళవారం ఉదయం మృతి చెందారు.
KMR: త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగారు.
ADB: విద్యార్థులు నిర్భయంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని గుడిహత్నూర్ సర్పంచ్ ఆడే శీలా అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాటశాల 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్స్ అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఉపాద్యాయులు స్టూడెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ చూపి 100% ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేయాలన్నారు.