MBNR: మాజీమంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్పై యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల శీను ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయ్యాక కూడా అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీలైతే అభివృద్ధికి పాటుపడాలి కానీ, ఇలా ప్రతిదానికి అడ్డంపడితే ఎలా అని ప్రశ్నించారు.
BDK: పినపాక మండలంలో రేపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యురాలు నేడు దుర్గ భవానీ తెలిపారు. రోగులు పాత మెడికల్ రిపోర్టులు, ఆధార్ కార్డుతో హాజరవ్వాలని తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తాల్మాలజిస్ట్, డెంటిస్ట్ వంటి నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
JN: స్టేషన్ ఘనపూర్లో TDP ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ రజనీకాంత్ హాజరై మాట్లాడుతూ.. అనునిత్యం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ పేదలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని అన్నారు.
MHBD: మరిపెడ మున్సిపాలిటీలో సోమవారం మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విజయనాంద్ తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మున్సిపల్ ఛైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు హాజరు కావాలని ఆయన కోరారు.
NZB: జిల్లా కేంద్రంలోని కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థుల రోబోటిక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నగరంలోని శ్రీరామ గార్డెన్స్లో ‘టెక్టానికా 2026’ పేరిట రోబో ఫెస్ట్ ఆదివారం నిర్వహించారు. కాకతీయ విద్యా సంస్థలకు చెందిన ప్రగతినగర్ క్యాంపస్, సుభాష్ నగర్ క్యాంపస్ KOSI 20 క్యాంపస్ల విద్యార్థులు సుమారు 350కి పైగా ప్రాజెక్టులు రూపొందించడం అభినందనీన్నారు.
WGL: ఎంజీఎం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. TGNPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కళాశాల ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్, కళాశాలలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నవారు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
WGL: ఎంజీఎం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. TGNPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కళాశాల ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్, కళాశాలలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నవారు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
KMM: భద్రాద్రి రామాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షనీయమని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అనిత అన్నారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వంలో అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు పురోహితులు వేదాశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
NLG: మర్రిగూడలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు దోమల వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1982 మార్చి 29న తెలుగు జాతి ఆత్మగౌరవం, పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారని కొనియాడారు.
RR: మియాపూర్లోని చెరువులను సుందర వనాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి పెద్ద కుడి చెరువు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. భావితరాలకు ఆస్తుల కంటే మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణం అందించడమే తమ బాధ్యతని, ఎమ్మెల్యే సహకారంతో ఈ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
HNK: బాలసముద్రంలోని CPI జిల్లా కార్యాలయంలో CPI హనుమకొండ జిల్లా సమితి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ… పార్టీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై CPI పోరాటాలు చేస్తుందన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద గుండ్లపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఇటీవల గుండ్లపల్లి స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై టోల్గేట్ యాజమాన్యంని టోల్ ప్లార్లక్ష్యాన్ని వారు ఖండించారు. స్టేజ్ వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో నిర్వహించగా, రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
KMR: మిషన్ భగీరథ నుంచి తాగునీటి సరఫరాను ఐదురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ సబ్డివిజన్ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లోని ఆవాసాలకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఐదురోజుల పాటు ఉండదని అధికారులు తెలిపారు.
VKB: జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ కోర్టులలో మొత్తంలో లోకదాలత్లో 38,097 కేసులు రాజీమార్గంతో పరిష్కారం అయినట్లు వికారాబాద్ జిల్లా జడ్జ్ చంద్ర కిషోర్ తెలిపారు. జిల్లాలో నిర్వహించిన లోక్ దాలత్ భారీగా కేసులు రాజీమార్గంతో పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు.