HYD: జాగృతి గ్రేటర్ HYD అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దేవరకొండ, ఎల్బీనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సంస్థ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త సభ్యులు ప్రజా సేవలో ముందుంటామని తెలిపారు.