MBNR: మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఓ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 217 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 32 మందిని ఉచిత ఆపరేషన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. వారికి భోజనం, రవాణా సౌకర్యాలను ఉచితంగా కల్పించారు. సర్పంచ్ రాంలాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాయణ, డా. శ్రవంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.