NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఇకపై ఆధునిక టెక్నాలజీతో దూసుకెళ్లనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు తీపి కబురు అందజేస్తూ వారి పని భారాన్ని తగ్గించేలా, పారదర్శకతను పెంచేలా కొత్త సెల్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. సుమారు 5047 అంగన్వాడీ కేంద్రాలన్నింటిలోని టీచర్లకు కూడా ఈ మొబైల్స్ పంపిణీ చేయనున్నారు.