CTR: జిల్లాలోని 621 పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల వసూలు లక్ష్యం రూ.24.14 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.22.83 కోట్లు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు తెలిపారు. 100% లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పన్నుల వసూలు లక్ష్యం చేరుకునేలా తప్పనిసరిగా కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు.