SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అశ్వవాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ స్వాగతం పలికారు.