PDPL: ముత్తారం PHCలో రేపు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. రామగుండం మెడికల్ కాలేజీకి చెందిన ఆరుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ శిబిరంలో పాల్గొని కంటి, ఎముకలు, గైనిక్, చిల్డ్రన్, డెంటల్ సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ప్రజలు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాలని వైద్యాధికారి డా. అమరేందర్ సూచించారు.