తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులు సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,774 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,447 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.