NGKL: బల్మూరు మండలం కొండనాగులలో ఉపాధి హామీ పథకంలో నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నట్లు టెక్నికల్ అసిస్టెంట్ శ్యామయ్య తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను బతికించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొక్కల సంరక్షణ కోసం వాచర్లు చురుగ్గా పాల్గొన్నారు.