NGKL: కల్వకుర్తి మండలం రఘుపతి పేట గ్రామంలో ఆదివారం రాత్రి జుమ్మా మసీదు ముందు గ్రామ సర్పంచ్ గుండాల గణేష్ హైమస్ట్ లైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైమస్ట్ లైట్లు మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.