AP: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు పిలుపుతో తన కుటుంబమంతా కలిసి ప్రచారం నిర్వహించామని గుర్తు చేశారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.