GDWL: మానవపాడు మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యుల కోసం ఆదివారం నిర్వహించిన పదో తరగతి ఓపెన్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. మండలవ్యాప్తంగా సుమారు 2760 మంది మహిళలు ఉత్సాహంగా ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఎంఈఓ శివప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. పదో తరగతి విద్యను పూర్తి చేయడం ద్వారా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందనరు.