అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో బీ.కాం విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు ఇవాళ స్థానిక కూరగాయల మార్కెట్కు ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మితా సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కొనుగోలు, అమ్మకాలు, ధరల మార్పులు, డిమాండ్-సప్లై పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.