కడప: కొండాపురం రైల్వే స్టేషన్ శివారులోని పంపు హౌస్-చిత్రావతి రైల్వే బ్రిడ్జి మధ్యలో గురువారం ఉదయం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మృతిడి తల మొండెం వేరు వేరు అయ్యి ట్రాక్ పైన పడినట్లు పేర్కొన్నారు. మృతి చెందడానికి గల కారణాలు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.