నంద్యాల: బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో తహశీల్దార్ పద్మావతమ్మ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ పాస్ పుస్తకాలను తొలగించి, పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం వీటిని అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. రికార్డుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే వీఆర్వోకు తెలియజేయాలని ఆమె సూచించారు.