కడప: మైదుకూరు పట్టణంలో మద్యానికి బానిసైన తండ్రి తన కొడుకును రూ.50 వేలకే విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదుతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి ప్రొద్దుటూరులో ఉన్న బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. ఘటనలో ఆసుపత్రి సిబ్బంది పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.