కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర 1వ డివిజన్లో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుధ్య పనులను పరిశీలించారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సిబ్బంది హాజరు పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలుపై కూడా సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.