MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 30వ తేదీలోగా ఇంటి పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ వక్కాల శ్యాంసుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల నుంచి ఇంటి పన్నుపై వడ్డీ పెరుగుతుందని, ఈ విషయాన్ని గృహ వినియోగదారులు గమనించి సకాలంలో పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.