GNTR: తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఈ నెల 26న కమిటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే, కమిటీ సభ్యుడు గుండా పిచ్చయ్య కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు తాత్కాలికంగా నిలిపి వేయాల్సిందిగా 11వ అదనపు జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చినట్లు ఎన్నికల అధికారి సాధువు ప్రతాప్ తెలిపారు.