ATP: అమరావతి విషయంలో YS జగన్ పదేపదే మాట మారుస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి విమర్శించారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తొలుత అమరావతికి మద్దతు తెలిపి, ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని మండిపడ్డారు. రాజధానిపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. అమరావతి రైతుల పోరాటం గొప్పదని కొనియాడారు.