W.G: ఆకివీడు పెదపేట హింసాత్మక ఘటనలో తెర వెనుక ఉన్న పాత్రధారుల పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు స్పష్టం చేశారు. ఉండి మండలం సాగుపాడులో మాట్లాడిన ఆయన, ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు ఎవరితో ఫోన్లో సంభాషించారనే డేటా అంతా భద్రంగా ఉందని పేర్కొన్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా దోషులందరినీ బయటకు తీస్తామని తెలిపారు.