PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి-మంచిర్యాల్ జిల్లాలలో నిన్న జరిగిన జాతీయ మెగా లోక్ అదాలతో 8120 కేసులు పరిష్కరించబడినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. 84 సైబర్ నేరాలకు సంబంధించి రూ. 61 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. D&D కేసులు 4892, ఈ-పెట్టి కేసులు 2537 పరిష్కరించామని సీపీ తెలిపారు.