MBNR: సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హిందూ ధర్మ రక్షక వ్యవస్థాపక అధ్యక్షుడు చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో శ్రీకరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉగాది పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సమానత్వం సేవాభావం ధార్మిక విలువలను పరిరక్షించడానికి కృషి చేయాలని అన్నారు.