TPT: ఏపీ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి సమీపంలో ఉన్న శ్రీభాగ్య అతిథి భవనం వద్ద టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.