NZB: జాతీయ లోక్ అదాలత్లో 5,662 కేసులు పరిష్కారం అయినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారికి రూ.31,82,649 తిరిగి బాధితులకు అందజేశామన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన, రాజీపడదగిన కేసులను పరిష్కరించామన్నారు.