IPLలో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే వేదికగా కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు పడే అవకాశం ఉండటంతో పాండ్యా ఛేజింగ్కే మొగ్గు చూపాడు. కాగా, ఈ రెండు జట్ల మధ్య జరిగిన 35 మ్యాచ్ల్లో ముంబై 24 సార్లు విజయం సాధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.