ADB: బజరత్నూర్ మండలంలోని పిప్రీ గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.89 లక్షల 60 వేలు నిధులు మంజూరు చేయటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. బోథ్ MLA అనిల్ జాదవ్ చొరవతో గ్రామానికి నిధులు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. ఉప సర్పంచ్ విశాల్, అరుణ్, రామ్ రెడ్డి, విద్యాసాగర్, ప్రభు, ప్రకాష్, అనిల్ చౌహన్, తదితరులున్నారు.