SDPT: అతి పురాతనమైన శ్రీ రంగనాయక స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చైత్ర నవమి సందర్భంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన వేడుకల్లో భాగంగా సుప్రభాత సేవ, పంజాభిషేకం, విశేష అలంకరణలు, గణపతి పూజలు నిర్వహించారు. ఆదివారం చివరి రోజున రంగనాయక స్వామి గుడి నుంచి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం వరకు స్వామివారి రథోత్సవం కనులపండువగా సాగింది.