MHBD: గూడూరు మండలం బొల్లెపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అందరిని కలచివేసింది. వివరాలిలా.. కడారి వీరస్వామి (42) తన 7ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రతి, మొక్కజొన్న, వరి, మిర్చి సాగు చేసాడు. పంటల పెట్టుబడి కోసం మూడేళ్ల నుంచి రూ. లక్షల్లో అప్పులు చేశాడు. దిగుబడి రాక, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.