సిద్దిపేట: చేర్యాల పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న మిషన్ భగీరథ నీటి సమస్య పరిష్కారమైంది. ఎన్నికల నుంచి నీరు రాక కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులపై నాలుగో వార్డు కౌన్సిలర్ నిమ్మ సుప్రజ రాజీవ్ రెడ్డి తక్షణమే స్పందించారు. పదవి చేపట్టిన మరుసటి రోజే పైప్లైన్ మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.