KMM: ఖమ్మం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.196 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ అనుదీప్ వివరాలను వెల్లడించారు. నగరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి పౌర సేవలను మెరుగుపరచాలని నిర్ణయించారు.