KMM: అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా ఏ ఎన్నిక వచ్చినా తీర్పు ‘వన్ సైడ్’గానే ఉందని, ఇది జీర్ణించుకోలేని గత పాలకులు ఒంటి నిండా విషాన్ని నింపుకుని చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు, ఆ భగవంతుడు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం” అని చెప్పారు. ప్రజలు తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు.