NZB: ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో కుమారుడిని గొడ్డలితో హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డబ్బుల విషయమై తండ్రి కొత్తగుళ్ల కిషన్కు తన కుమారుడు భాను ప్రకాశ్ (22)తో గొడవ ఏర్పడిందని పోలీసులు తెలిపారు. కోపంతో గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు చెప్పారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు పంపారు.