NLG: నల్గొండ-సాగర్ రోడ్లోని లింగోటం వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పులిమామిడి గ్రామ కార్యదర్శి మోహన్ రావు అలియాస్ మనోహర్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విధులకు వెళుతున్న ఆయనను టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన స్వగ్రామం పజ్జురుగా తెలుస్తుంది.