MDK: రామాయంపేటలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనపై మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం తహసీల్దార్ రజనీకుమారి పర్యవేక్షణలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నిబంధనలకు అనుగుణంగా గణన ప్రక్రియను పూర్తి చేస్తామని సిబ్బందితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. పారదర్శకంగా వివరాలను సేకరించాలని ఎన్యుమరేటర్లకు తహసీల్దార్ దిశానిర్దేశం చేశారు.